Header Banner

చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల సమావేశం వాయిదా! కారణం ఇదే.!

  Sat Jun 14, 2025 21:31        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు జరప తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ భేటీ జూన్ 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరగాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. దీనికి తోడు, ఈ సమావేశానికి హాజరుకావాల్సిన మరికొంతమంది ముఖ్యమైన పెద్దలు కూడా అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుతానికి ఈ భేటీని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ.. కాపాడాలంటూ లోకేశ్ కు కన్నీటి వేడుకోలు!

 

తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్... నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, డీవీవీ దానయ్య, కేవీ రామారావు... నటులు నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్ దగ్గుబాటి, మంచు మనోజ్, సుమన్, ఆర్. నారాయణమూర్తి, నాని తదితరులు పాల్గొంటారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులకు ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ భేటీకి సుమారు 35 నుంచి 40 మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu Naidu #AP CM #Tollywood #Telugu Film Industry #Andhra Pradesh #Kandula Durgesh #Film shootings #Movie #Industry Meet